పెద్దపల్లి : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల మూర్తి తన స్నేహితుడైన తిరుపతికి 2014 సంవత్సరంలో రూ.2,40,000 అప్పుగా ఇచ్చాడు. కాగా, అప్పు తీర్చేందుకు తిరుపతి, మూర్తికి చెక్కు రాసిచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ అవడంతో మూర్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ప్రాసిక్యూషన్ తరపున ఆర్.సురేష్ బాబు వాదనలు వినిపించి, తగు ఆధారాలను ప్రవేశపెట్టారు. పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి చెల్లని చెక్కు ఇచ్చిన తిరుపతికి ఏడాది కఠిన కారాగార శిక్ష, నాలుగు లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.