ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భూక్యా నరేశ్ గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన నర్ర లింగారెడ్డి వద్ద ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో రూ.41.76 లక్షలకు ఓ ప్లాటు కొనుగోలు చేశారు.
అడ్వాన్సుగా రూ.15. 50 లక్షలు ఇచ్చారు. మిగతా సొమ్ము చెల్లించేందుకు ఆలస్యమైంది. లింగారెడ్డి కొడుకు నర్ర విద్యాసాగర్రెడ్డి (ఇటీవలే కాంగ్రెస్లో చేరారు) రిజిస్ట్రేషన్ కోసం అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాల ని డిమాండ్ చేశాడు. నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు విద్యాసాగర్రెడ్డి, లింగారెడ్డిపై కేసు నమోదు చేశా రు. విద్యాసాగర్రెడ్డిని జైలుకు తరలించినట్టు ఎస్సై రమాకాంత్ తెలిపారు.