జియాగూడ, జనవరి 22: హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు. ఈ ఘటన కుల్సుంపుర ఠాణా పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్కుమార్ వివరాల ప్రకారం.. రామంతాపూర్ స్ట్రీట్ నంబర్-5, కామాక్షిపురానికి చెందిన సాయినాథ్ (30) కార్పెంటర్. ఆదివారం మధ్యా హ్నం 3.30గంటల సమయంలో జియాగూడ వందఫీట్ల బైపాస్ రోడ్డులో బైక్పై వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులతో నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహా న్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడు అవివాహితుడు. హత్య ఘటనను అక్కడి వారు సెల్ఫోన్లలో చిత్రీకరించారే తప్పా, ఎవరూ ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారు స్నేహితులేనని తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.