హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఆలయ పూజారులు ఆహ్వానించారు. అలాగే మార్చి 1వ తేదీ నుంచి 11వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కేసీఆర్ను కోరారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్కు ఆశీర్వచనం పలికారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వరాచార్యులు, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, కిరణ్కుమారాచార్యులు, భాసర్, రాజన్బాబు తదితరులు పాల్గొన్నారు.