నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక తుదిఓటర్ల జాబితా విడుదలైం ది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367 అని ప్రకటించారు. గతంలో ఈ సంఖ్య 2,27,625 ఉన్నది. ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నిక ల కమిషన్ అవకాశం కల్పించగా.. 24,781 దరఖాస్తులు వచ్చాయి. వాటి ని నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హత కలిగిన దరఖాస్తులకు అధికారులు ఓకే చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారితోపాటు కొత్తగా పళ్లై కోడళ్లుగా వచ్చిన వారి దరఖాస్తులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
ఇతర ప్రాంతాల నుంచి మునుగోడు నియోజకవర్గానికి ఓట్ల బదిలీ దరఖాస్తులపై కఠినంగా వ్యవహరించారు. మొత్తంగా వివిధ దశల్లో పరిశీలన అనంతరం శనివారం తుదిఓటరు జాబితాను అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఓటర్ల సంఖ్య 2,41,367కు చేరింది. అదనంగా 14,102 ఓట్లు చేరాయి. ఓటర్లలో 1,21,501 మంది పురుషులు కాగా, 1,19,859 మంది మహిళలు, ఏడుగురు ట్రాన్స్జెండర్లు. మండలాలవారీగా పరిశీలిస్తే చౌటుప్ప ల్లో అత్యధికంగా 59,419 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా గట్టుప్పల్లో 14,413 మంది ఉన్నారు. నారాయణపురంలో 36,430 మంది, మునుగోడులో 35,887 మంది, నాంపల్లిలో 33,820 మంది, చండూరులో 33,243 మంది, మర్రిగూడ లో 28,155 మంది ఉన్నారు.