హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అయిన కోస్గి కాలేజీ జేఎన్టీయూలో విలీనమయ్యింది. ఈ కాలేజీని వర్సిటీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. దీంతో వర్సిటీ కాన్స్టియంట్ కాలేజీల సంఖ్య 9కి చేరింది.
ఎప్సెట్ ద్వారా సీట్లను భర్తీచేయగా, స్పాట్ అడ్మిషన్లను జేఎన్టీయూ కాలేజీ హోదాలో భర్తీచేశారు. ఇటీవలే ఖమ్మం జిల్లా మధిరలో కొత్త కాలేజీ ఏర్పాటు చేశారు. ఈ కాలేజీని కూడా జేఎన్టీయూలో విలీనం చేస్తారా..? లేక..ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీగా కొనసాగిస్తారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.