హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిషారం చూపడం, హకులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమే ప్రజాపాలన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరొన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భమని, ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హకుల కోసం పోరాడిన యోధులకు నివాళులు అర్పించారు.
భూ పరిపాలనలో సంసరణల కోసం భూ భారతి చట్టం తీసుకొచ్చామని, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించామని తెలిపారు. 5.94 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసినట్టు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపామని చెప్పారు. డిసెంబర్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఆవిషరిస్తామని వెల్లడించారు.