హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ విముక్తి కోసం మహనీయులు చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో 17 సెప్టెంబర్, 1948కి ప్రత్యేక స్థానం ఉన్నదని గుర్తుచేశారు. ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ అనేది కేవలం ఒక చరిత్రాత్మక ఘట్టంగా స్మరించుకోవడం మాత్రమే కాదని, దేశ నిర్మాణ ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భమని పేర్కొన్నారు.
ఈ పోరాటంలో అనేక మంది మహనీయుల త్యాగాలు, ధైర్యసాహసాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేశా రు. వల్లభ్భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. పరేడ్గ్రౌండ్లో తెలంగాణ కళారూపాలు, వేయి స్తంభాల గుడి, బతుకమ్మ శకటాలను ప్రదర్శించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్రెడ్డి, బండి సం జ య్, ఎంపీ ఈటల పాల్గొన్నారు.