హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 19న ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ గురువారం సంయుక్తంగా ప్రకటించాయి. ‘తల్లిదండ్రులతో భాగస్వామ్యం.. ప్రతి విద్యార్థి అభ్యసనకు బలం’ అనే ఇతివృత్తంతో నిర్వహించే ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం శుక్రవారం ఉద్యోగ జేఏసీ నేతలతో జరపనున్న చర్చల్లో పెన్షనర్ల సమస్యలపై దృష్టిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజుకు గురువారం వినతిపత్రం అందజేశారు. హెల్త్కార్డుల సమస్యలను పరిష్కరించాలని, ఎంపానెల్డ్ దవాఖానల్లో చికిత్సకు అవకాశం కల్పించాలని, రూ. 398 వేతనంతో సేవలందించి రిటైర్ అయిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు.