సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): లైసెన్స్ రెన్యూవల్ చేయడంతోపాటు పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఖైరతాబాద్లోని వాటర్వర్క్స్ రెవెన్యూ అధికారి, అతని వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఎల్ రాకేశ్ ఖైరతాబాద్లోని వాటర్వర్క్స్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.
అతని వద్ద సందీప్ అనే వ్యక్తి ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. ఇదిలావుండగా.. జనవరి, ఫిబ్రవరికి సంబంధించి పెండింగ్ బిల్స్తోపాటు పాత లైసెన్స్ రెన్యూవల్ కోసం అక్బర్ హుస్సేన్ వాటర్వర్క్స్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే పని పూర్తి చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని అక్బర్ హుస్సేన్ను ఇద్దరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ సిటీ రేంజ్-1 యూనిట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం బాధితుడు లక్ష నగదును రాకేశ్కు అందించాడు. వాటిని ఆయన ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు.