హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆదివారం జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్2023 పరీక్ష సజావుగా ముగిసింది. ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు సమాచారం. అభ్యర్థుల ప్రొవిజనల్ ఆన్సర్ ‘కీ’ని 9 నుంచి https:// jeeadv. ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
11 నుంచి కీపై అభ్యంతరాలను స్వీకరిస్తా రు. ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా, గణితం, కెమిస్ట్రీ కొంచెం కష్టంగానే వచ్చాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈసారి ఓపెన్ క్యాటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు దాదాపు 60 ఉండవచ్చని భావిస్తున్నారు.