హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది. వాటిలో హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి ఉండగా మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా జనసేనకు కనీసం డిపాజిట్ దక్కలేదు.
కూకట్పల్లిలో మాత్రమే ఆ పార్టీ 39 వేల ఓట్లను తెచ్చుకోగలిగింది. మిగిలిన స్థానాల్లో నాలుగు వేల ఓట్లను దాటలేదు. ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ ప్రచారం చేసినా కూడా తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని కనీస స్థాయిలో కూడా ఆదరించలేదు.