హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్లో హ్యూమానిటీస్ సబ్జెకుతో చదివి గణితంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో నేరుగా ప్రత్యేక ప్రవేశం కల్పిస్తున్నామని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ప్రతినిధి తెలిపారు. బోర్డ్ చానల్ ద్వా రా ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీలో నేరుగా ప్ర వేశం పొందవచ్చని, ఈ మేరకు అడ్మిషన్ నో టిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు.
బీటెక్ కంప్యూటర్ సైన్స్తోపాటు మాస్టర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్ ఇన్ కంప్యుటేషనల్ న్యాచురల్ సై న్సెస్), బీటెక్ కంప్యూటర్ సైన్స్తోపాటు మా స్టర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్ ఇన్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్) వంటి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ట్రిపుల్ ఐటీ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.