Inter Exam Fee | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 14 వరకు ఫీజును విద్యార్థుల నుంచి స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 వరకు ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.510, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ.730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు వివరించింది.