చిట్యాల, జూన్ 25: అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూకల్కు చెందిన సౌడ కిషన్ (32) రెండేండ్లుగా వ్యవసాయంతోపాటు మక్క, పత్తి కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నిరుడు పత్తిపంటకు చీడపీడలు సోకడంతో పంట దెబ్బతిన్నది.
వ్యాపారంలోనూ నష్టం వచ్చి రూ.లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో హౌసింగ్లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 14న పంటచేను వద్ద పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి వరంగల్ ఎంజీఎం దవాఖానకు, ఈ నెల 23న హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.