హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఆడిట్ నిబంధనల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన వర్క్షాపులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఫీల్డ్ లెవల్ అధికారులు ఎదురొంటున్న సవాళ్లను పరిషరించడానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ‘అకౌంట్స్ అండ్ ఆడిట్, పెన్షన్ అండ్ జీపీఎఫ్’ అనే అంశంపై రాష్ట్రస్థాయి వర్షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) మాధవి, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్ అండ్ వీఎల్సీ) నరేశ్కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్టైటిల్మెంట్స్) అభయ్ సోనారర్ హాజరై ప్రసంగించారు. సిబ్బందికి పెన్షన్ విధానాలు, జీపీఎఫ్ నిర్వహణపై అవగాహన పెంపొందించాలని, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయెల్, ఫైర్ డీజీ విక్రమ్సింగ్మాన్, డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్, డీఐజీ అభిషేక్ మహంతి, ఎస్పీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.