హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ టెక్నాలజీతో ఈ వంతెన నిర్మాణం జరుగనున్నది. రూ.1,082.56 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కి.మీ. దూరం తగ్గుతుంది. తెలంగాణ వైపు లలిత సోమేశ్వరస్వామి ఆలయం, ఏపీ వైపు సంగమేశ్వర ఆలయం కనువిందు చేస్తాయని గడ్కరీ తెలిపారు.