హైదరాబాద్ మెట్రోరైలు ఆదివారంనుంచి 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఇప్పటివరకూ 70కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నది. మరో 10 కిలోమీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్వే సేఫ్టీ అనుమతిచ్చింది.
రైళ్ల వేగాన్ని గతనెల 28, 29 తేదీల్లో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సెఫ్టీ అధికారులు పరిశీలించారు. అనంతరం పది కిలోమీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు అనుమతులు జారీచేశారు. కాగా, నాగోల్ – రాయదుర్గం 6 నిమిషాలు, మియపూర్ – ఎల్బీనగర్ 4 నిమిషాలు, జేబీఎస్ – ఎంజీబీఎస్ 1.5 నిమిషాలు ప్రయాణ సమయం ఆదా కానున్నది.