Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే పది రోజులపాటు ఎండల తీవ్రత తగ్గి.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25 వరకు తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలి పింది. ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
తర్వాత ఎండల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఇటీవలి వర్షాల కారణంగా మూడు రోజులు గా కాస్త ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.