రాయికల్, అక్టోబర్ 24: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధంకాగా, యజమాని సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వస్తాపూర్లో సోమవారం రాత్రి జరిగింది. రాయికల్ ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. వస్తాపూర్కు చెందిన సంకె చిన్న భూమయ్య (38) గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు.
భార్య లక్ష్మి తన ముగ్గురు పిల్లలతో రెం డ్రోజుల క్రితం సారంగాపూర్ మండలం రేచపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. ఇంటి వద్ద చిన్న భూమయ్య ఒకడే ఉన్నాడు. సోమవారం రాత్రి భూమయ్య ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్యూట్ కాగా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. నిద్రలో ఉన్న చిన్న భూమయ్య సజీవ దహనమయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.