రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హోంగార్డులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకొన్నారు. తమతో కలిసి పనిచేసిన హోంగార్డులు పీ మల్లేశం, సంపత్ ఇటీవల మృతి చెందగా, ఆ కుటుంబాలకు ఒక రోజు వేతనం అందించి అండగా నిలిచారు.
మంగళవారం సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మల్లేశం కుటుంబానికి ఒకరోజు వేతనం కింద రూ.1.88 లక్షలు, వెల్ఫేర్ నుంచి మరో రూ.20 వేల చెక్కును ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా ఇప్పించి అందరి అభినందనలు అందుకొన్నారు.
– సిరిసిల్ల రూరల్