హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ సక్రమంగానే ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆలయాల నిర్వహణ మత సంప్రదాయాలకు అనుగుణంగా జరగడం లేదని, అన్యమతస్థులకు ఆలయాల్లో వివిధ బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వ అఫిడవిట్ను పరిశీలించాక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం ఇటీవల ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఈ మేరకు సదరు పిల్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.