హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే టైపిస్ట్, క్లర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ అన్ని అర్హతలూ కలిగి ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీని, ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ 2021 ఏప్రిల్ 1న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీచేసిన ప్రొసీడింగ్స్కు వ్యతిరేకంగా 200 మంది ఉద్యోగులు విడివిడిగా 8 పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు సోమవారం ఈ తీర్పు ఇచ్చింది. 10 ఏండ్లకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులుగా చేస్తున్నవారిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం స్పష్టం చేసింది.