హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాశ్రమాల ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. చట్ట ప్రకారం జిల్లాకొకటి ఉండాలనే నిబంధనను గుర్తుచేసింది.
ఆ మేరకు ఉన్నాయో లేవో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్లకు సోమవారం నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.