హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తె లంగాణ): రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను ఈ నెల 19 వరకు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జా రీ చేసింది. ఈ మేరకు జస్టిస్ పీ మాధవీదేవి స్టే విధించారు. ఇతర జిల్లాల టీచర్లను జీవో 317 ద్వారా రంగారెడ్డి జిల్లా కేటాయించార ని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని పేర్కొంటూ పలువురు సూల్ అసిస్టెంట్ టీచర్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
అధికారులు తాతాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారని పిటిషనర్లు కోరారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరడంతో హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డీఈవో, డీఎస్ఈతోపాటు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కా ర్యదర్శిని ఆదేశించింది.