హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టు లెక్చరర్లు, మహిళా, శిశు సంక్షేమశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఇప్పుడే నియామక ఉత్తర్వులు ఇవ్వవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. నియామకాలు, కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ ఏ సంతోష్రెడ్డి ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరీస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16, మహిళా, శిశు సంక్షేమశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 18ను కొట్టివేయాలని ములుగుకు చెందిన బానోతు సునీత, మరో ముగ్గురు నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.