హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ బదిలీల స్టేను హైకోర్టు 26 వరకు పొడిగించింది. టీచర్ల బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో 9ను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. త్వరలో ఎన్నికలు జరగనున్నందున బదిలీలపై స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే దాని ప్రభావం బదిలీలపై ఉంటుందన్నారు.