హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఆమోదించారో లేదో ఎన్నికల అధికారులు స్పష్టం చేయలేదని పేర్కొంటూ మిర్యాలగూడ స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ పిటిషన్పై శనివారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదన వినిపిస్తూ.. నామినేషన్ దాఖలు సందర్భంగా పిటిషనర్ రూ.10 వేల డిపాజిట్ సొమ్ము చెల్లించలేదని తెలిపారు. దీంతో ఆ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.