హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో వరదల వేళ డ్రైనేజీ ప్రమాదాల నివారణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకవర్షాకాలంలో ప్రమాదాలు జరుగడం.. కలాసిగూడ సమీపంలో మౌనిక, జూబ్లీహిల్స్లో వివేక్ అనే చిన్నారులు మరణించడంపై అందిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ఇటీవల విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.