హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించనున్న ‘హ్యాండ్లూమ్ మార్చ్’ను విజయవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సం ఘం చేనేత విభాగం పిలుపునిచ్చింది. సోమవారం మహారాష్ట్రలోని నాందేడ్లో మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించింది. సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి మాట్లాడుతూ మార్చ్ అనంతరం కాన్స్టిట్యూషన్ క్లబ్లో హ్యాండ్లూమ్ డిక్లరేషన్పై ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందని వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం చేనేతపై పన్నులు విధించడంతో చేనేత పరిశ్రమ నష్టపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘం పూర్వ అధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్వార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరాఠ్వాడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మారుతి, చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న, సంఘ ప్రధానకార్యదర్శి జగన్నాథం, ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్, మహిళా ప్రధాన కార్యదర్శి సునీత, మహారాష్ట్ర అధ్యక్షుడు భూపతి కమటం, వరింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ గోనె తదితరులు పాల్గొన్నారు.