బంజారాహిల్స్, సెప్టెంబర్ 9: చేనేత వస్ర్తా లు ధరించడం ద్వారా అందంతోపాటు హుం దాతనం కనిపిస్తుందని ప్రముఖ యాంకర్ సుమ కనకాల చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీటీ వీవ్స్లో మనోహర ఫెస్టివ్ కలెక్షన్స్ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత వస్ర్తాల ప్రదర్శనను శనివారం ఆమె ప్రారంభించారు.
పర్యావరణహిత రంగులతో సంప్రదాయ చేనేతకు ఆధునికతను జోడించి రూ పొందించిన వస్ర్తాలు ఆకట్టుకునేలా ఉన్నాయని సుమ పేర్కొన్నారు. మారుతున్న ట్రెం డ్కు అనుగుణంగా చేనేత కళాకారులు డిజైన్లు రూపొందిస్తే మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు.