హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సోమవారం నుంచి హజ్యాత్ర ప్రారంభం కానున్నది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 5.50 గంటలకు వివిధ జిల్లాలకు చెందిన 373 మంది యాత్రికులు హజ్కు బయలుదేరుతారు. ఏపీ నుంచి 3వేల మంది హజ్ యాత్రికులు కూడా హైదరాబాద్ మీదుగా వెళ్లనున్నారు. వీరందరికీ నాంపల్లిలోని హజ్హౌస్లోనే విడిది ఏర్పాటు చేశారు. ఇమ్మిగ్రేషన్, లగేజీ చెకింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ వంటి ప్రయాణ అవసరాలన్నీ నగరంలో నాంపల్లిలోని హజ్ క్యాంపులో పూర్తయ్యేలా చర్యలు తీసుకొన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు 72గంటల ముందుగానే యాత్రికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నెగెటివ్ వచ్చినవారిని యాత్రకు అనుమతిస్తున్నారు.
నాంపల్లిలోని హజ్హౌస్లో హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం యాత్రికులను సాగనంపనున్నారు. తొలి విమానంలో హైదరాబాద్ నుంచి 214, మెదక్ 16, నల్లగొండ 44, సంగారెడ్డి, గద్వాల 2, సిద్దిపేట 16, యాదాద్రి భువనగిరి 12, మేడ్చల్ 71 ప్రయాణికులు వెళ్లనున్నారు. 30 వరకు 10విమానాల ద్వారా యాత్రికులు హజ్కు తరలివెళ్తారు. హజ్ నుంచి జెడ్డా చేరుకొని తర్వాత జూలై 20 నుంచి విడతలవారీగా హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు.