పెద్దపల్లి : కళాకారుడు గొస్కుల కొమురయ్య మృతి తీరనిలోటని సినీ హీరో, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. సోమవారం జిల్లాలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో కళాకారుడు గొస్కుల కొమురయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా నారాయణ మూర్తి కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతపురం కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మారుమూల్ల గ్రామంలో జన్మించిన కొమురయ్య తన ఎర్ర సైన్యం సినిమాతో పాటు తదితర సినిమాలో పాటలు రాశాడన్నారు.
అలాగే ఆయనకు గ్రామీణ ప్రాంతంలో గిరిజన ప్రజల గురించి బాగా తెలున్నారు. ఆయన వెంట కొమురయ్య కుమారుడు రమేష్ తదితరులు ఉన్నారు.