సూర్యాపేట : ఆంజనేయ స్వామి(Anjaneya Swamy) అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish reddy) ఆకాంక్షించారు. ఆదివారం సూర్యాపేట(Suryapet) రూరల్ మండలం దాస్ తండా(Das Tanda)లో నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా సాగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో దీపధూప నైవేద్యానికి ఇబ్బంది కలుగకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీ అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.