కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామీణ వైద్య సేవకుల (ఆర్ఎంపీ) సంఘం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కొడంగల్లో గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి సంఘం తరపున చేసిన ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేసింది.
నియోజకవర్గంలోని ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను గుర్తించి కొడంగల్లోని గాంధీనగర్ 4వ వార్డులో భవనం మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసినట్టు సంఘం నాయకులు తెలిపారు.