అబిడ్స్, అక్టోబర్ 14: బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ ప్రారంభమైందని హైదరాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న మాణిక్రావు, నాయకులు దండూరి శంకర్ చెప్పారు. గుజరాత్లోని సూరత్ లింబాయత్లో గుజరాత్ గౌడ సంఘానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా మాణిక్రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయని అన్నారు. తెలంగాణ నుంచి సూరత్లో స్థిరపడిన వారంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా సూరత్లో తిరిగి అన్ని వర్గాలవారిని కలిసి బీఆర్ఎస్లో చేరాలని కోరుతున్నామని చెప్పారు. లింబాయత్లో 40 మంది బీఆర్ఎస్లో చేరారని తెలిపారు.