హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖలో పలువురు సంయుక్త రవాణా కమిషనర్లను (జేటీసీ) బదిలీచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్లో ఎస్/ఆర్టీఏగా ఉన్న జే పాండురంగ నాయక్ను అడ్మిన్కు బదిలీ చేసింది.
అక్కడ పనిచేస్తున్న మమతాప్రసాద్ను ఐటీ, విజిలెన్స్కు.. ఐటీ, విజిలెన్స్ జేటీసీగా ఉన్న సీ రమేశ్ను హైదరాబాద్లో ఎస్/ఆర్టీఏగా పాండురంగ నాయక్ స్థానంలో నియమించింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఓడీలపై పనిచేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్కానిస్టెబుళ్లు, కానిస్టేబుళ్ల ఓడీలను కూడా ప్రభుత్వం రద్దుచేసింది.