Manjeera | రాష్ట్రంలో ఓ వైపు కరువు పరిస్థితులు తాండవిస్తుంటే మరోవైపు ఉన్న నీటిని కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిహస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మంజీరా ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజీ గేట్లు, పిల్లర్లకు మరమ్మతులు చేయడంలో కాలయాపణ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సరైన నిర్వహణ లేకపోవడం వల్ల బ్యారేజ్ మనుగడ ప్రమాదంలో పడిందని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (ఎస్డీఎస్ఓ) సైతం హెచ్చరించింది. అయినప్పటికి పాలకులు పట్టించుకోవడం లేదు. గేట్లు రిపేర్ చేయకపోవడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఎల్నినో పరిస్థితి తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నిపుణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.