హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పంటల సాగుకు రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది కూడా అవసరమైన జనుము, జీలుగ, పిల్లిపెసర పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కోసం రూ.77 కోట్ల సబ్సిడీని భరిస్తున్నది.
నిరుడు సుమారు రూ.75 కోట్లు, అంతకు ముందు ఏడా ది రూ.70 కోట్ల సబ్సిడీని భరించింది. ఈ ఏడాది సుమారు 20 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచింది. పంట సాగుకు రెండు నెలల ముందు పచ్చిరొట్టను సాగుచేసి అదే పొలంలో కలియ దున్నడం వల్ల పంటకు అవసరమైన 50 శాతం నత్రజని, భాస్వరం వీటి నుంచే ఉత్పత్తి అవుతాయి. దీంతో పైనుంచి యూరియా, డీఏపీ చల్లాల్సిన అవసరం ఉండదు.