హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అకంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
అకంపేట ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. ఇదిలా ఉండగా, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి (బి) గ్రామంలోని అమరవీరుల స్తూపం సుందరీకరణ, స్మృతివనం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ఒక ఎకరం భూమిని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.