హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విభాగాల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న ఉద్యోగులందరూ గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తమ సొంత స్థానాలకు వెళ్లాలని ఆదేశించారు.
ఎంత మంది డిప్యూటేషన్ ఉద్యోగులు తిరిగి వచ్చారో వివరాలు అందజేయాలని, ఇంకెవరూ డిప్యూటేషన్పై పనిచేయడం లేదని నిర్ధారించాలని ఆయా విభాగాల హెచ్వోడీలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా డిప్యూటేషన్ అవసరమైతే జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే లేఖలను మాత్రమే అనుమతించాలని పేర్కొన్నారు.