హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) కింద ప్రభుత్వం 2023-24 బడ్జెట్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని రిలీజ్ చేసింది.