హైదరాబాద్, సెప్టెంబర్29 (నమస్తే తెలంగాణ): వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.3 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే కాలేజీల్లో వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమశాఖ అధికారులను ఆదేశించింది.