హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రాణి కుముదిని సర్వీస్ను ప్రభుత్వం మరో రెండేండ్లు పొడిగించింది.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రాణి కుముదిని సర్వీస్ను ప్రభుత్వం మరో రెండేండ్లు పొడిగించింది. ప్రస్తుతం ఆమె కార్మిక, ఉపాధి కల్పన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పొడిగింపు శనివారం నుంచి అమల్లోకి వస్తుందని సీఎస్ శాంతికుమారి శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.