హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తె లంగాణ) : హైదరాబాద్లో నాలుగు రోజులు జరిగిన జీ20 సమావేశాలు బుధవారం ముగిశాయి. ‘డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్(డీఈడబ్ల్యూజీ) రెండో విడత సమావేశంలో జీ20 సభ్యదేశాలతోపాటు 8 ఆహ్వానిత దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంతీయ సంస్థ ప్రాతినిధ్యం వహించాయి. మొత్తంగా 81 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. డిజిటల్ సిల్లింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ ఇన్ డిజిటల్ ఎకానమీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ మూడు థీమాటిక్ సెషన్లలో 350 మం దికిపైగా ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతినిధులు ఐఐటీ హైదరాబాద్ను, టీహబ్ను సందర్శించా రు. అత్యాధునిక పరిశోధనలను చూసి ముగ్ధులయ్యారు. మూడు రోజుల పాటు అనేక సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంసృతి, వంటకాలు, కళలు, జానపద రూపాల గొప్పతనాన్ని ప్రతినిధులకు ప్రదర్శించారన్నారు. డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని జూన్లో మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించనున్నారు.