శంషాబాద్ రూరల్, మార్చి 10: శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బెంగుళూరు వెళ్లాల్సిన విమానం మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు మధ్యాహ్నం 3.55గంటలకు వెళ్లాల్సిన విమానం సా యంత్రం ఆరు వరకు వెళ్లలేదు.
ఆలస్యంపై ఎన్నిసార్లు అడిగినా ఎయిర్పోర్టు అధికారులు సమాధానమివ్వలేదని ఆందోళకు దిగినట్టు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికు ల్లో చిన్నపిల్లలు సైతం ఉన్నట్టు సమాచారం. సాయంత్రం 7 గంటలకు ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్టు ప్రయాణికులు తెలిపారు. ఎయిర్పోర్టు, ఎయిర్లైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో కనీసం తాగడానికి నీళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తున్నది.