హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయాలు, వ్యాపార భవన సముదాయా లు, దవాఖానలు, పెట్రోల్ బంక్లలో ఫైర్ మాక్డ్రిల్స్ నిర్వహించినట్టు వెల్లడించారు.
ప్రజలు, ఆయా కంపెనీల ఉద్యోగులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. మంటలార్పే విధానంపై అవగాహన కల్పించినట్టు వివరించారు.