యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన కృష్ణ అప్రమమత్తమై తప్పించుకున్నాడు.
ప్రధాన రహదారిపై ఈ ఘటన జరుగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.