మహబూబ్నగర్ : వరుసకు కూతురయ్యే అయ్యే బాలికపై బాబాయి లైంగిక దాడికి పాల్పడి ఆమెను హత్య చేసిన దారుణ ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాబాయితో పాటు అతడి ముగ్గురు స్నేహితులు సైతం లైంగిక దాడిలో పాల్గొనడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు శనివారం ధర్నా నిర్వహించారు.
బాలానగర్ మండలం తిరుమలగిరిలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే రాత్రి బాలిక బాబాయ్ శ్రీనివాస్, మరో ముగ్గురు ఆ ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె వారితో తీవ్రంగా ప్రతిఘటించడంతో హత్య చేసి ఆమెను ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఆధ్వర్యంలో బాలానగర్ ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులలో ఇద్దరు పట్టుబడడంతో గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.