హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏడాదిన్నర క్రితమే క్యాటగిరీల వారీగా ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా జోన్లు, మల్టి జోన్ల వారీగా కేటాయింపులు జరిపారు.
అయితే వారింకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి ఉద్యోగుల విభజన జరుపాలని ఉద్యోగులు కోరుతున్నారు.